- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన ఖాయితీ లంబాడాలు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : వాల్మీకి బోయలు, పెద్ద బోయలు, మథుర ఖాయితీ లంబాడాలు, మాలి సహా బేదర్, కిరాతక, నిషాది, భాట్ మధురాలు, చమర్ మధురాలు, చుండువాల్లు, తలయారి కులాలను ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ తీర్మానం ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ కు చెందిన మథుర ఖాయితీ లంబాడాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అధ్వర్యంలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు. ఏళ్ల తరబడి ఉన్న తమ సమస్యను గుర్తించి అసెంబ్లీలో తీర్మానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి జీవితకాలం రుణపడి ఉంటామని ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలానికి కాయితి లంబడాలు ధన్యవాదాలు తెలిపారు.