ఎల్లారెడ్డిలో ఘనంగా కాన్షీరాం జయంతి వేడుకలు

by Dishanational1 |
ఎల్లారెడ్డిలో ఘనంగా కాన్షీరాం జయంతి వేడుకలు
X

దిశ, నాగిరెడ్డిపేట్(ఎల్లారెడ్డి): కేంద్రంలో, రాష్ట్రంలో అధికార పార్టీల ఆగడాలను అడ్డుకుని, వారు చేస్తున్న మోసాలను అరికట్టాలంటే బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేస్తేనే బడుగు బలహీన వర్గాలు, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు వస్తుందని బహుజన సమాజ్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బట్టెంకి బాలరాజు అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు, బహుజన రాజ్యాధికార యోధుడు, మాన్యశ్రీ కాన్షీరాం 89వ జయంతి వేడుకలను ఎల్లారెడ్డి అసెంబ్లీ అధ్యక్షులు అట్కారి బబ్లూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాన్షీరాం జయంతి సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ఆవరణలో కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాన్షీరాం సమాజానికి చేసిన సేవలను నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్చార్జ్ గుల్లని సాయిలు, జోనల్ మహిళ కన్వీనర్ బి. వసంత, ఎల్లారెడ్డి పట్టణ కమిటీ అధ్యక్షుడు మర్లు సాయిబాబా, ఉపాధ్యాక్షులు కుషల కంటి సాయిలు, కామారెడ్డి అసెంబ్లీ కార్యదర్శి బట్టు రాజలింగం, రాజంపేట మండల అధ్యక్షులు భాను, ఎల్లారెడ్డి మండల ఉపాధ్యక్షులు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed