- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రెడ్ క్రాస్ రక్త కేంద్రానికి ఐఎస్ఓ గుర్తింపు.
దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాదు జిల్లా రెడ్ క్రాస్ రక్త కేంద్రం గత శనివారం ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైసెషన్ వారు వచ్చి తనిఖీ చేశారు. రెడ్ క్రాస్ సంస్థ వివరాలు, చేపడుతున్న కార్యక్రమాలు రెడ్ క్రాస్ రక్త కేంద్రం పరిశుభ్రత, రక్త సేకరణ నాణ్యత పరిమాణాలు తనిఖీ చేసి ఐఎస్ఓ సరిఫికేట్ జారీ చేశారని నిజామాబాద్ జిల్లా శాఖ రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు తెలిపారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో చేపట్టిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరాజన్ చేతుల మిదిగా నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ కార్యవర్గాన్ని ప్రశంసిస్తూ ఐఎస్ఓ పత్రం అందజేశారు. రెడ్ క్రాస్ లో ఎక్కువ సార్లు రక్త దానం చేసిన నిజామాబాదు జిల్లా కోర్టు ఉద్యోగి కే.నాగేందర్ ని జ్ఞాపికతో ప్రశంసిస్తూ మున్ముందు కూడా ఇలానే రక్తదానం చేస్తూ యువతకి స్ఫూర్తి నివ్వాలని కోరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్ పాల్గొన్నారు.