ఇది స్కూలా బర్ల దొడ్డా..? ఎమ్మెల్యే గారు: కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మదన్ మోహన్ రావు

by Disha Web Desk 6 |
ఇది స్కూలా బర్ల దొడ్డా..? ఎమ్మెల్యే గారు: కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మదన్ మోహన్ రావు
X

దిశ గాంధారి: ఇది స్కూల్ లేక బర్లను కట్టేసే దొడ్డా.. అని కాంగ్రెస్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు మదన్ మోహన్ రావు మీడియా ముఖంగా ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ను ప్రశ్నించారు. స్కూల్లో కనీసం ఫ్లోరింగ్ లేకుండా, కిటికీలు, తలుపులు, లేని పాఠశాలను ఇప్పటికీ ఒక్కసారి కూడా ఈ తాండాని సందర్శించలేదని మదన్ మోహన్ రావు అన్నారు.

వివరాలలోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రం నాగులూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కాయితి తాండలో గల పాఠశాల గురించి మదన్ మోహన్ మాట్లాడుతూ.. ఎక్కడ చూసిన అభివృద్ధి పథంలో భారాస దూసుకుపోతుందని చెప్పుకోవడం ఇదేనా? మీ అభివృద్ధి అని ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులను వారి కనీసం సౌకర్యాలు మంచినీరు కూడా లేని దుస్థితి నెలకొందని అసహనం వ్యక్తం చేశారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గెలుపొందిన నుండి ఇప్పటివరకు కాయితి తాండకు రాలేదని అన్నారు. ఇకనైనా మీ గొప్పలు చెప్పుకోవడం మానుకొని ఒక్కసారి కాయితి తాండ కు వచ్చి అప్పుడు చెప్పండి మీరు చేసిన డెవలప్మెంట్ ఎంతగా బాగుందో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed