ఆ గ్రామాల ఉద్యోగులకు శుభవార్త

by Disha Web Desk 20 |
ఆ గ్రామాల ఉద్యోగులకు శుభవార్త
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాదు మున్సిపల్ కార్పొరేషన్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల పరిధి పెరిగిన నేపథ్యంలో గ్రామాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచుతూ జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి ప్రొసిడింగ్ అందజేశారు. నిజామాబాదు కార్పొరేషన్ పరిధిలో 23 గ్రామాలు, ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో 18 గ్రామాలు, బోధన్ పరిధిలో ఒక్క గ్రామానికి హెచ్ఆర్ఏ పరిధి పెంచుతూ ప్రొసీడింగ్ ఇచ్చామన్నారు.

ప్రొసీడింగ్ ఇచ్చిన సందర్భంలో పీఆర్ టియూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్ గౌడ్, టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు అలుక కిషన్, అమృత్ కుమార్ లు హర్షం వ్యక్తం చేశారు. హెచ్ఆర్ఏ కేటాయింపునకు సహకరించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Next Story

Most Viewed