మార్క్ ఫెడ్ శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం..

by Disha Web Desk 6 |
మార్క్ ఫెడ్ శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం..
X

దిశ, రాజంపేట: మండలంలోని ఆర్గొండ గ్రామంలో శుక్రవారం రోజున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు,శనగల కొనుగోలు కేంద్రమును సొసైటీ అధ్యక్షులు కంది శివరాములు ప్రారంభించడం జరిగింది. శనగలను నాణ్యత పరిమాణాల ఆధారంగా ఎండబెట్టి, శుభ్రపరిచి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తీసుకరావాలని తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర ఒక క్వింటాలకు రూ. 5335 కల్పిస్తుందని అన్నారు.

రైతులు పట్టాపాసు బుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ జిరాక్స్‌లు, వెంట తీసుకరావాలని తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు అధ్యక్షులు శ్రీ జూకంటి మోహన్ రెడ్డి, సొసైటీ వైస్ ప్రెసిడెంట్ నిమ్మల సుధాకర్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మి,ఎంపీటీసీ సాగర్, డైరెక్టర్లు బుట్ట రాజు, బాణాల మల్లారెడ్డి, తోట మధుకర్, జే. నారగౌడ్ ఏఈఓ శిల్ప, సీఈఓ సాయిలు, సిబ్బంది మరియు రైతులు శివయ్య, నాగేశ్వర్ రావు,రాజు, రవి,పాల్గొన్నారు.



Next Story

Most Viewed