ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-10-01 12:13:41  IST  )

దిశ, బాన్సువాడ : బీర్కూరు మండలంలో ఐ.కె.పి. ఆధ్వర్యంలో బైరాపూర్ (నాగపూర్ శివారు), కిష్టాపూర్, తిమ్మాపూర్ గ్రామ సంఘాల ద్వారా కనీస

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
X

దిశ, బాన్సువాడ : బీర్కూరు మండలంలో ఐ.కె.పి. ఆధ్వర్యంలో బైరాపూర్ (నాగపూర్ శివారు), కిష్టాపూర్, తిమ్మాపూర్ గ్రామ సంఘాల ద్వారా కనీస మద్దతు ధరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఐ.కె.పి. ఏ.పీ.ఎం. శిరీష తెల్పారు, ఆమె మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర 2389/₹ రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి ధర 2368/₹ గా నిర్ణయించినట్లు తేమ 17% శాతం కు తక్కువ ఉండాలని తెల్పారు. రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల లో అమ్మాలని అన్నారు. కార్యక్రమంలో బీర్కూర్ తాహసిల్దార్ మరియు ఐ.కె.పి. ఎ.పి.ఎం. మండల సమైక్య సిబ్బంది పాల్గొన్నారు.

Next Story