ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు

by velandi.Saikiran |

వ్యవసాయ మార్కెట్ కమిటీ గాంధారి ఆధ్వ‌ర్యంలో పశుసంవర్ధక శాఖ సహకారంతో శనివారం సీతాయిపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య

ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు
X

దిశ, గాంధారి : వ్యవసాయ మార్కెట్ కమిటీ గాంధారి ఆధ్వ‌ర్యంలో పశుసంవర్ధక శాఖ సహకారంతో శనివారం సీతాయిపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎఎంసి చైర్మన్ బండారి పరమేశ్వర్, వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్ ప్రారంబించారు. ఈ శిబిరంలో దాదాపు 60 మంది రైతులు తమ పశువులకు ఉచితంగా వైద్య సేవలు వినియోగించుకున్నారు. ఉచిత వైద్యంతో పాటు ఉచిత మందులు కూడా అందించినట్టు చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి డైరెక్టర్లు సాయిలు, అనిత, బాలయ్య, బిల్ సింగ్, జి. సాయిలు, ఎఎంసి కార్యదర్శి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story