గ్రామాల్లో విస్తృతంగా పోడు భూముల సర్వే..

by Disha Web Desk 20 |
గ్రామాల్లో విస్తృతంగా పోడు భూముల సర్వే..
X

దిశ, ఇందల్వాయి : ఇందల్వాయి మండలంలోని పలు గ్రామాల్లో అటవీ, రెవెన్యూ అధికారులు ఉమ్మడిగా పోడు భూముల సర్వేను నిర్వహిస్తున్నారు. సర్వేనంబర్ ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి పోడు భూములకు శనివారం అధికారులు స్వయంగా పరిశీలించి ధరఖాస్తు దారులను విచారించారు. అనంతరం పొజీషన్ సంబంధించి వివరాలు సేకరంచారు.

సర్వే నంబర్ 1107, 1181, 2070 లలో ఇందాల్వాయి గ్రామానికి చెందిన సుమారు 25 మంది లబ్ధదారులకు సంబంధించిన వివరాలను సేకరించారు. అనంతరం ప్రభుత్వానికి నివేదికను అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ బీట్ అధికారి రాకేష్, వ్యవసాయ శాఖ అధికారి ప్రకాష్, సర్పంచ్ సత్తెవ్వ, పంచాయతీ కార్యదర్శి భారత్, జెగ్గ రాములు, పుజం రవికుమార్, శ్రీనివాస్, కరోబార్ పోచయ్య తదితులున్నారు.

Next Story

Most Viewed