పీఆర్సీ కోసం నల్ల బ్యాడ్జీలు ధరించి విద్యుత్ ఉద్యోగుల నిరసన

by Dishafeatures2 |
పీఆర్సీ కోసం నల్ల బ్యాడ్జీలు ధరించి విద్యుత్ ఉద్యోగుల నిరసన
X

దిశ, నిజామాబాద్ సిటీ: విద్యుత్ ఉద్యోగులకు ఏప్రిల్ 1, 2022 నుండి రావల్సిన నూతన వేతనాలపై పీఆర్ సీ వేసి దాదాపు ఏడాది అయినప్పటికీ యాజమాన్యం నుండి ఎలాంటి స్పష్టత లేకపోవడంపై రాష్ట్ర తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయ్స్ జే ఏ సీ టీ పిలుపు మేరకు దశల వారి ఆందోళనలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ లోని విద్యుత్ పవర్ హౌస్ (ఎస్ఈ కార్యాలయము) జిల్లా జే ఏ సీ చైర్మన్ బి.రఘునందన్ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బాడ్జీలు. ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యుత్ నాయకుల పిలుపు మేరకు దీర్ఘ కాలిక సమస్యలకై మొదటి రోజు చాలా పెద్ద మొత్తంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, యజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి చర్చలు జరిపి, తమ న్యాయమైన డిమాడ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రోజుల్లో పీ ఆర్ సీ కోసం ఉద్యమం ఉదృతం చేస్తామని తెలియజేశారు.రానున్న రోజుల్లో ఉద్యాగులు స్ట్రైక్ కు వెళ్ళుతే విద్యుత్ కు అంతరాయం కలిగితే ప్రజలకు, ప్రభుత్వo జవాబు దారులవుతారని తెలిపారు. నిరసన కార్యక్రమములో ట్రేడ్ యూనియన్, అసోసిమేషన్ నాయకులు ఈ కన్వీనర్ బాలేష్ కుమార్, కో- చైర్మెన్ పూగారి గంగాధర్, రాజేంధర్ రెడ్డి సురేష్ ముమార్. కంగారాం నాయక్, రాజేందర్, నిజానికాన్సిన్, సరిత, అనిత, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed