మే 13న ఎకనామిక్స్ తెలుగు మీడియం పరీక్ష

by Disha Web Desk 1 |
మే 13న ఎకనామిక్స్ తెలుగు మీడియం పరీక్ష
X

దిశ, నిజామాబాద్ సిటీ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ తెలుగు మీడియం పరీక్షను మే 13న నిర్వహించనున్నారు. మునుపటి పరీక్ష కేంద్రాలలోనే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.వీ.దుర్గాప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అభ్యాసకులు గమనించి పరీక్ష కేంద్రాలకు ఒక గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. ఇది వరకు మే 2న జరగాల్సిన పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. స్టడీ సెంటర్ల కో-ఆర్డినేటర్లు విద్యార్థులకు ఈ విషయాన్ని చేరవేసి పరీక్షకు హాజరయ్యేలా చూడాలని సూచించారు.


Next Story