- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాఠశాలలు, ఏటీసీ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వ పాఠశాలలు, ఐ.టీ.ఐలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వ పాఠశాలలు, ఐ.టీ.ఐలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. చందూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు అదే ఆవరణలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. ముఖ గుర్తింపు విధానం(ఎఫ్.ఆర్.ఎస్) ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు తీసుకున్నారా అని పరిశీలించారు. విద్యార్థులు కోసం వండిన మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని సూచించారు. డైనింగ్ హాల్ నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయి ఉండడాన్ని గమనించిన కలెక్టర్.. పనులను పూర్తి చేయించాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. అనంతరం బోధన్ పట్టణం, నిజామాబాద్ నగరాల్లో ప్రభుత్వ ఐ.టీ.ఐ లకు అనుసంధానంగా ప్రభుత్వం నూతనంగా నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. ఈ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.






