ఈవీఎం, బ్యాలెట్ యంత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి : కలెక్టర్

by Disha Web Desk 20 |
ఈవీఎం, బ్యాలెట్ యంత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి : కలెక్టర్
X

దిశ, నిజామాబాద్ సిటీ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన కలెక్టర్, అవి నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్ రావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.



Next Story

Most Viewed