సబ్ స్టేషన్ ప్రాంతంలో చిరుత సంచారం

by Disha Web Desk 1 |
సబ్ స్టేషన్ ప్రాంతంలో చిరుత సంచారం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో చిరుత పట్టపగలు జన సంచారంలోకి అడుగు పెట్టింది. ఏకంగా అటవీ ప్రాంతం ఆనుకొని విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంతంలో ఆదివారం పూట చిరుత సంచారం భయాందోళన కలిగించింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడప్గల్ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రాంతంలో చిరుత పులి రావడంతో విద్యుత్ ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది సబ్ స్టేషన్ లోకి వెళ్లి చిరుత బారి నుంచి ప్రాణాలను కాపాడుకున్నారు. సబ్ స్టేషన్ సమీపంలో జనావాస ప్రాంతం కావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందజేశారు.



Next Story

Most Viewed