- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చలో విద్యుత్ సౌదా, చలో హైదరాబాద్.. మార్చ్ 24 బహిరంగ సమావేశం..
మార్చ్ 24 శుక్రవారం రాష్ట్ర టీఎస్ పిజేఏసీ పిలుపుమేరకు ఉదయం 11 గంటలకు విద్యుత్ సౌదా హైదరాబాద్ లో పీఆర్సీ, ఈపీఎఫ్ టూ జీపీఎఫ్ పై విద్యుత్ ఉద్యోగుల మహాబహిరంగ సమావేశానికి హాజరు కావాల్సిందిగా నిజామాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ రఘునాథన్ కోరారు.

దిశ, నిజామాబాద్ సిటీ : మార్చ్ 24 శుక్రవారం రాష్ట్ర టీఎస్ పిజేఏసీ పిలుపుమేరకు ఉదయం 11 గంటలకు విద్యుత్ సౌదా హైదరాబాద్ లో పీఆర్సీ, ఈపీఎఫ్ టూ జీపీఎఫ్ పై విద్యుత్ ఉద్యోగుల మహాబహిరంగ సమావేశానికి హాజరు కావాల్సిందిగా నిజామాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ రఘునాథన్ కోరారు. ఈ మేరకు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్సీని, ఈపీఎఫ్ టూ జీపీఎఫ్ ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ వరంగల్ కేటీపీఎస్ లలో సమావేశాలు నిర్వహించామని మార్చ్ 24చలో విద్యుత్ సౌదా హైదరాబాదులో ఇది చివరి సమావేశం అని అన్నారు.
మేనేజ్మెంట్ ప్రకటించకుంటే ఆ బహిరంగ సమావేశంలో రాష్ట్ర జేఏసీ నిర్ణయించిన ప్రకారం మేము కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ఆర్ బాలేష్ కుమార్ కో చైర్మన్ పి గంగాధర్, కో కన్వీనర్ తోట రాజశేఖర్, ఏ. కాశీనాథ్, గంగారాం నాయక్, సురేష్ కుమార్, రాజేందర్ గౌడ్, రాజేందర్, రాంసింగ్, సుస్మిత, రాంసింగ్, శ్రీనివాస్ రావు, శంకర్ గౌడ్, శుభాన్ పఠాన్, శ్రీనివాస్, ప్రశాంత్, అశోశ్, రమణ తదితరులు పాల్గొన్నారు.






