కర్ణాటక నుంచే బీజేపీ పతనం మొదలు : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

by Disha Web Desk 1 |
కర్ణాటక నుంచే బీజేపీ పతనం మొదలు : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
X

దిశ, ఆర్మూర్ : కర్ణాటక రాష్ట్రంలో ఘోర పరాజయంతో బీజేపీ ముక్త్ సౌతిండియాగా మారిందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. కర్ణాటక నుంచే అభివృద్ధి నిరోధక బీజేపీ పతనం మొదలైందని అన్నారు. ఆదివారం ఆయ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల మధ్య మతాల చిచ్చు పెట్టి దేశాన్ని నాశనం చేస్తున్న కమలనాథుల విద్వేష రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు.

కార్పొరేట్ శక్తులకు వెన్నుదన్నుగా నిలిచి పేద ప్రజల బతుకులను బలి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ డ్రామాలకు శ్వాశతంగా తెర దించేందకు కర్ణాటక రాష్ట్ర ప్రజలు దేశానికి దిశానిర్దేశం చేశారని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలోని అన్ని చోట్ల బీజేపీ ఖాతాలు క్లోజ్ అవుతాయని, తెలంగాణలో అయితే బీజేపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. బీజేపీ పాలన నుంచి విముక్తి కలిగిస్తూ కర్ణాటకలో ఎన్నికల తీర్పు వచ్చిందన్నారు. కాగా, కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఏమాత్రం ఉండదన్నారు.

తెలంగాణ గడ్డపై మూడోసారి కూడా బీఆర్ఎస్ దే విజయమన్న ధీమాను జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారని అన్నారు. కర్ణాటక ఫలితాలపై రేవంత్, బండి సంజయ్ లది వింత ధోరణి అని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని, ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని పగటి కలలు కంటున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసినవి సిగ్గు మాలిన వ్యాఖ్యలని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ లో కాంగ్రెస్, బీజేపీలకు సింగిల్ డిజిట్ కూడా దక్కదని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read..

కర్ణాటక ఫలితాలతో బీఆర్ఎస్ ​అలర్ట్.. ఆ విషయాలపై ఆరా..!



Next Story

Most Viewed