బైరాపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ..

by Disha Web Desk 20 |
బైరాపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ..
X

దిశ, బీర్కూర్ : బీర్కూరు మండలంలోని బైరాపురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న 37 డబుల్ బెడ్ రూమ్ లను మాజీ జెడ్పిటిసి సభ్యులు ద్రోణవల్లి సతీష్ భూమి పూజ చేశారు. సందర్భంగా మాజీ జెడ్పిటిసి సభ్యులు ద్రోణవల్లి సతీష్ మాట్లాడుతూ అత్యధిక డబుల్ బెడ్ రూమ్ లను నిర్మించడం బాన్సువాడ నియోజకవర్గం లోని బీర్కూర్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ నిర్మించి ఇస్తామని తెలిపారు. సొంత జాగా ఉన్నవారికి ఇల్లు నిర్మించుకుంటే మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు.

ఎవరు కూడా పూరి గుడిసెలో ఉండకూడదని తెలిపారు. అడిగిన వెంటనే డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేస్తున్న శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజవ్వ లక్ష్మణ్, దిశ గంగన్న, ఉపసర్పంచ్ లింగమయ్య, జడ్పిటిసి సభ్యులు స్వరూప శ్రీనివాస్, బీర్కూర్ ఎంపిటిసి సందీప్, నాయకులు లాడగమ వీరేశం, గంగాధర్ ప్రజలు ఉన్నారు.

Next Story

Most Viewed