- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తక్షణమే యూరియా సరఫరా చేయాలి
by velandi.Saikiran |
రైతుల సమస్యలు పరిగణలోకి తీసుకోని వెంటనే యూరియా సరఫరా చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని భారతీయ కిసాన్ సంఘ్ కోరింది.

X
దిశ, కామారెడ్డి : రైతుల సమస్యలు పరిగణలోకి తీసుకోని వెంటనే యూరియా సరఫరా చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని భారతీయ కిసాన్ సంఘ్ కోరింది. మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డిని కలిసి కిసాన్ సంఘ్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో యూరియా కొరత ఉండటంతో రైతులు ఆగ్రహంగా ఉన్నారన్నారు. ప్రైవేట్ వ్యాపారులు మాఫియాగా తయారవుతున్నారని, యూరియా కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. అధిక ధరలకు విక్రయిస్తూ అవసరం లేకున్నా ఇతర మందులు అంటగడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, జిల్లా కార్యదర్శి శంకర్ రావు జిల్లా ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి, రమణారెడ్డి, గోపాల్ రెడ్డి, అంజన్న, భైరవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






