ధాన్యం కొనుగోళ్లు పూర్తి.. సొసైటీ చైర్మన్ బాలగోని రాజా గౌడ్..

by Disha Web Desk 20 |
ధాన్యం కొనుగోళ్లు పూర్తి.. సొసైటీ చైర్మన్ బాలగోని రాజా గౌడ్..
X

దిశ, భిక్కనూరు : తమ కొనుగోలు కేంద్రం పరిధిలో ఉన్నగ్రామాల నుంచి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసినట్లు సొసైటీ చైర్మన్ బాలగోని రాజా గౌడ్ తెలిపారు. శుక్రవారం ఆయన భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలోని సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేనివిధంగా నూటికి నూరు శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసినట్లు వివరించారు. అందరికంటే ముందుగా 60 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జేసీ చంద్రమోహన్, సివిల్ సప్లై అధికారులతో పాటు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.


Next Story