జాతీయ పంచాయతీ అవార్డులు-2022 పై అవగాహన సమావేశం

by Disha Web Desk 20 |
జాతీయ పంచాయతీ అవార్డులు-2022 పై అవగాహన సమావేశం
X

దిశ, దోమకొండ : జాతీయ పంచాయతీ ఆవార్డులు-2022 పై మండల అవగాహన సమావేశాన్ని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో చిన్నా రెడ్డి నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏంపీడీవో మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో 9 థీమ్స్ లో ఉన్న నిధుల వివరాలు, ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా జరుగుతున్న లబ్దిని పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపివో తిరుపతి, పంచాయతీ రాజ్ ఏఈ సురేందర్ రెడ్డి, ఆర్ డబ్ల్యు ఎస్ మీనా, మండల వ్యవసాయ అధికారి పవన్, ఏపీవో రజని, ఐసీడీఎస్ సూపర్ వైజర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed