హాస్పిటల్ సెక్యూరిటీ గార్డు పై దాడి..

by Disha Web Desk 20 |
హాస్పిటల్ సెక్యూరిటీ గార్డు పై దాడి..
X

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న గంగారాజు అనే వ్యక్తి పై పేషెంట్ల బంధువులు స్టీల్ కడెం, కంకర రాళ్లతో దాడి చేశారు. బాధితులు, హాస్పిటల్ సిబ్బంది, పోలీసుల కథనం మేరకు కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లో గంగరాజు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. గంగారాజు మంగళవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో డెలివరీ అయిన బాలింత మహిళల కోసం కేటాయించిన వార్డులో ఇద్దరు వ్యక్తులు బాలింత వద్ద ఉండగా ఇది బాలింతల కొరకు కేటాయించిన రూములో ఉండవద్దని సెక్యూరిటీ గార్డ్ గంగరాజు చెప్పారు.

దీంతో ఒకేసారి కోపద్రోక్తులైన ఇద్దరు వ్యక్తులు రంజిత్, రాజు మద్యం మత్తులో గంగరాజును హాస్పిటల్ నుంచి బయటకు ఈడ్చుకుంటూ స్టీల్ కడెం, కంకర రాళ్లతో తలపై దాడి చేయడంతో గంగారాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా అడ్డుకోబోయిన డ్యూటీలో ఉన్న ఓ మహిళా నర్సు పై ఇద్దరు వ్యక్తులు దుర్భాషలాడారు. అదే సమయంలో గంగరాజు తమ్ముడు హాస్పిటల్ వద్దకు చేరుకున్నాడు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించి అడ్డుకోబోయిన తమ్ముడు భరత్ పైన కూడా స్టీల్ కడెం, కంకర రాళ్లతో, దాడి చేసి గాయపరిచారు. వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం చేరవేయడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునేలోపే దాడిచేసి గాయపరిచిన రంజిత్, రాజు పరారయ్యారు.

అనంతరం గాయపడ్డ గంగరాజు, భరత్ కామారెడ్డి ఏరియా హాస్పిటల్ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అనంతరం దీనిపై హాస్పిటల్ సిబ్బందిని వివరణ కోరగా గత కొద్ది నెలలుగా ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో కొంతమంది జులాయి వ్యక్తులు మద్యం మత్తులో వచ్చి ముఖ్యంగా మహిళా స్టాప్ నర్సులను, డ్యూటీ డాక్టర్లను సెక్యూరిటీ గార్డలను పై దుర్భాషలాడుతూ దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జులాయి వ్యక్తుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం గాయపరిచిన ఇద్దరు వ్యక్తులపై బాధితులు స్థానిక కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు వ్యక్తులపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed