రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

by Disha Web Desk 1 |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
X

దిశ, తాడ్వాయి : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తాడ్వాయి మండల కేంద్రంలోని హెచ్.పీ పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లింగంపేట మండలం కొర్పోల్ గ్రామానికి చెందిన నర్సని స్వామి (35) బతుకుదెరువు కోసం కామారెడ్డి పట్టణానికి కూలి పనికి వెళ్లేవాడు. మంగళవారం కూడా రోజూ లాగానే స్కూటీపై పని కోసం బయలుదేరాడు. ఈ క్రమంలో తాడ్వాయి మండల కేంద్రంలోని హెచ్.పీ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే ముందుగా వెళ్తున్న స్కూటీని వెనక నుంచి బైక్ బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో స్వామి తలకు బలమైన గాయంకావడంతో సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సమాచారంతో అతడిని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా స్వామి మార్గమధ్యలో మృతి చెందాడని పోలీసులు తెలిపారు. స్కూటీపై ఉన్న తాడ్వాయి గ్రామానికి చెందిన బాలకిషన్ రావుకు కూడా గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడి తల్లి బాలవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. కాగా, మృతుడికి ముగ్గురూ ఆడ పిల్లలే.



Next Story

Most Viewed