Breaking News : కల్తీ కల్లు తాగి 15 మందికి సీరియస్

by Muthe.Rajitha |

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది.

Breaking News : కల్తీ కల్లు తాగి 15 మందికి సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కల్తీ కల్లు తాగిన 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యి ఆసుపత్రి పాలయ్యారు. కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో అనేక మంది కల్తీ కల్లు తాగి అనారోగ్యం పాలయ్యారు. వీరిలో 15 మందికి సీరియస్ ఉండటంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలియజేశారు. గ్రామంలోని బాధితులంతా మతిస్థిమితం కోల్పోయినట్టు వింతగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Next Story