డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డిన వ్య‌క్తికి 15 రోజుల జైలు శిక్ష.. రూ. 5వేల జరిమానా

by Nallavelli.Anjaneyulu |

మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డిపిన కేసులో నిందితుడికి 15 రోజుల జైలు శిక్ష‌తో పాటు రూ.5వేలు జ‌రిమానాను కోర్టు విధించింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డిన వ్య‌క్తికి 15 రోజుల జైలు శిక్ష.. రూ. 5వేల జరిమానా
X

దిశ, బాన్సువాడ : మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డిపిన కేసులో నిందితుడికి 15 రోజుల జైలు శిక్ష‌తో పాటు రూ.5వేలు జ‌రిమానాను కోర్టు విధించింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బాన్సువాడలోని సంగేశ్వర కాలనీకి చెందిన షేక్ ఇస్మాయిల్ పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. తనిఖీల సందర్భంగా అతని మద్యం స్థాయి రీడింగ్‌లు 323 మి.గ్రా, 179 మి.గ్రా గా నమోదయ్యాయి. నిర్దేశిత పరిమితిని మించి మద్యం సేవించి వాహనం నడిపినట్లు తేలడంతో కేసును కోర్టుకు పంపించారు. బుధవారం ఈ కేసును విచారించిన రెండవ తరగతి మేజిస్ట్రేట్ టి. గోపాల్ నిందితుడికి 15 రోజుల జైలు శిక్షతో పాటు రూ.5వేల‌ జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనపు శిక్ష విధించబడుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణ సీఐ తుల శ్రీధర్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని, ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో కానిస్టేబుల్ సుధీర్ పాల్గొన్నారు.

Next Story