పీఎఫ్ఐ కేసులో నిందితులని కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ

by Disha Web Desk 4 |
పీఎఫ్ఐ కేసులో నిందితులని కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ
X

దిశ, వెబ్‌డెస్క్: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. పీఎఫ్‌ఐ కేసులో నిందితులని ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది. చంచల్ గూడ జైలులో ఉన్న నలుగురిని ఎన్ఐఏ కస్టడీకి తీసుకుంది. జహీద్, సమీఉద్దిన్‌, మాజ్ హాస్సేన్, కలీమ్‌లను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుని చంచల్ గూడ జైలు నుంచి మాదాపూర్ ఎన్ఐఏ కార్యాలయానికి ఎన్ఐఏ అధికారులు తరలించారు. పీఎఫ్ఐ ముసుగులో సంస్థ సభ్యులు మతపరమైన దాడులకు కుట్ర పన్నినట్లు గుర్తించిన ఎన్ఐఏ ఈ సంస్థపై నిషేధం విధించడంతో పాటు ఈ కేసులో అరెస్టులు చేసి నిందితులను విచారిస్తున్న విషయం తెలిసిందే.


Next Story

Most Viewed