తుది దశకు కొత్త DGP నియామక ప్రక్రియ.. ముగ్గురు ఐపీఎస్‌లతో UPSC లిస్ట్ ఫైనల్

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-18 13:35:11  IST  )

రాష్ట్రానికి నూతన డీజీపీని నియమించే ప్రక్రియ క్లైమాక్స్‌కు చేరింది. ఈ మేరకు ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన జాబితాను యూపీఎస్‌సీ ఖరారు చేసింది.

తుది దశకు కొత్త DGP నియామక ప్రక్రియ.. ముగ్గురు ఐపీఎస్‌లతో UPSC లిస్ట్ ఫైనల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రానికి మూడో పూర్తి కాలపు డీజీపీని నియమించే ప్రక్రియ ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన యూపీఎస్సీ (UPSC), ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన తుది జాబితాను ఖరారు చేస్తూ ప్రత్యుత్తరం పంపింది. అయితే, ఆ హాట్ లిస్ట్‌లో 1991 బ్యాచ్‌కు చెందిన ప్రస్తుత హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్, 1994 బ్యాచ్‌కు చెందిన ఐబీ స్పెషల్ డైరెక్టర్ (కేంద్ర సర్వీసులు), 1994 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా ఉన్నారు. ఇందులో ఒకరిని హెడ్‌ ఆఫ్‌ ది పోలీస్‌ ఫోర్స్‌గా నియమితులు కానున్నారు. అయితే, వచ్చే నెలలో ప్రస్తుత డీజీపీ శివధర్‌ రెడ్డి పదవీ విరమణ చేయబోతున్న విషయం తెలిసిందే.

Next Story