రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీను నియామకం.. ఆదివాసీలు హర్షం

by Disha Web Desk 2 |
రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీను నియామకం.. ఆదివాసీలు హర్షం
X

దిశ, తెలంగాణ బ్యూరో: నేషనల్ ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎన్‌టీఎఫ్) రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం ఎన్టీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో నేషనల్ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించినట్టు ఎన్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉషాకిరణ్ తెలియజేశారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మేడ శ్రీను ((ఉస్మానియా యూనివర్సిటీ) నియమితులయ్యారు. ఉస్మానియా వేదికగా ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తున్న శ్రీనును రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించడంతో ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed