- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కుల్లో మరి న్ని సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పరిశ్రమల పార్కుల్లో ఐఏఎల్ నిధులతో వార్షిక నిర్వహణ, భద్రతా సేవలు, విద్యుత్ వంటి మౌలిక వనతుల పనుల కోసం మొత్తం 9 టెండర్లకు ఈ- ప్రొక్యూర్మెంట్ నోటిఫికేష న్ విడుదల చేసింది. ఈ నెల 22న బిడ్ డౌన్లోడ్ ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చేనె ల 6 మ ధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్లను సమర్పించాల్సి ఉంటుంది.
రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైటింగ్
జీడిమెట్ల, గాంధీనగర్, నాచారం, మౌలాలి, చర్లపల్లి, మల్లాపూర్, ఉప్పల్, బాలానగర్ వంటి హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లోని కీలక పారిశ్రామిక పార్కులు ఈ పనుల్లో భాగం కానున్నాయి. రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైటింగ్, విద్యుత్ సరఫరా, భద్రతా సేవలు వంటి మౌలిక వసతుల వార్షిక నిర్వహణ పనులు చేపట్టనున్నారు. రహదారి విస్తరణకు అనుబంధంగా విద్యుత్ లైన్లు తరలించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యాచారం సెక్షన్లో రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లు, డీటీఆర్లు, ఎల్టీ లైన్లను రోడ్డు మధ్య నుంచి పక్కకు తరలించే కీలక పనులకు ప్రత్యేకంగా టెండర్ పిలిచారు. మేడ్చల్-సిద్దిపేట జోన్లోని మల్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్లో చేపట్టనున్న నిర్వహణ పనులను ఎస్సీ/ఎస్టీ కాంట్రాక్టర్లకు మాత్రమే కేటాయించడం ద్వారా సామాజిక నమానత్వానికి ప్రాధాన్యం ఇచ్చారు. పార్కుల్లో మౌలిక వసతులు మెరుగుపడి, పరిశ్రమల కార్యకలాపాలు వేగవంతం కానున్నాయి. దీంతో కొత్త పెట్టబడులు ఆకర్షించడంతో పాటు, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్ల గాంధీనగర్ పారిశ్రామిక పార్క్ వార్షిక మెయింటెనెన్స్ పనులకు రూ.2.48 కోట్లు, మేడ్చల్ పరిధిలోని నాచారం పారిశ్రామిక పార్కులో అభివృద్ధి పనులకు రూ.1.15 కోట్లు, మేడ్చల్-సిద్దిపేట జోన్లోని మౌలాలి పారిశ్రామిక పార్కులో అభివృద్ధి పనులకు రూ.42.86 లక్షలు, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక పార్కులో అభివృద్ధి పనులకు రూ.39.45 కోట్లు, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలోని బాలానగర్ పారిశ్రామిక పార్కులో అభివృద్ధి పనులకు రూ.64.03 లక్షలు, హైదరాబాద్ పరిధిలోని చర్లపల్లి పారిశ్రామిక పార్కులో అభివృద్ధి పనులకు రూ.1.09 కోట్లు, మేడ్చల్-సిద్దిపేట జోన్లో మల్లాపూర్ పారిశ్రామిక పార్కులో అభివృద్ధి పనులకు రూ.49.98 లక్షలు, మేడ్చల్ పరిధిలోని ఉప్పల్ పారిశ్రామిక పార్కులో అభివృద్ధి పనులకు రూ.1.21 కోట్లు, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జోన్లోని మేడిపల్లిలో విద్యుత్ లైన్ తరలింపునకు రూ.2.20 కోట్లుగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు.






