- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అధికారుల నిర్లక్ష్యం.. ఫార్ములా-ఈ రేస్ పాస్ల కోసం గంటల తరబడి వెయిటింగ్!
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ హుస్సేన్సాగర్ తీరాన నేడు ఫార్ములా- ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుండే అధికారులు పాస్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం మీడియా ప్రతినిధులు, జీహెచ్ఎంసీ కార్యకర్తలతో పాటు పలువురు ప్రతినిధులు ఉదయం 9 గంటలకే పాస్ల కోసం ఐమాక్స్ సమీపంలోని హెచ్ఎండీఏ పార్కుకి చేరుకున్నారు. ఉదయం 9 గంటలకే పాస్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాల్సిన అధికారులు.. మధ్యాహ్నం కావస్తున్నా ఇంకా డోర్లు కూడా తెరవకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొట్టమొదటి సారి దేశంలోనే హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ ఏర్పాట్లలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని.. రెండు రోజుల పాటు సాగే కార్ల రేస్ ఏర్పాట్లలో అధికారులు బాధ్యతారాహితంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.