NDRF: రెండు తెలుగు రాష్ట్రాలకు అమిత్ షా గుడ్ న్యూస్

by Prasad Jukanti |

రెండు తెలుగు రాష్ట్రాలకు అమిత్ షా గుడ్ న్యూస్

NDRF: రెండు తెలుగు రాష్ట్రాలకు అమిత్ షా గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2024లో వరదలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా ప్రభావితమైన ఐదు రాష్ట్రాలకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) (NDRF) కింద రూ. 1554.99 కోట్ల అదనపు సహాయం అందించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నేతృత్వంలోని జరిగిన ఉన్నత స్థాయి కమిటీ ఈ నిధుల మంజూరుకు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.1554.99 కోట్లలో ఆంధ్రప్రదేశ్‌కు (Andrapradesh) రూ.608.08 కోట్లు, నాగాలాండ్‌కు రూ.170.99 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, తెలంగాణకు (Telangana) రూ.231.75 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు మంజూరయ్యాయి.

Next Story