- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మెడికో ప్రీతి మరణంపై తండ్రి నరేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్డెస్క్: కాకతీయ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థిని మెడికో ప్రీతి మరణంపై ఆమె తండ్రి నరేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు ప్రీతిది మమ్మాటికే హత్యే అని ఆయన ఆరోపించారు. సోమవారం మెడికో ప్రీతి కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ అంజనీకుమార్ను కలిశారు. ఈ సందర్భంగా ప్రీతి తండ్రి మీడియాతో మాట్లాడారు. పోలీసులు ఇవాళ మరోసారి తమ స్టేట్మెంట్ రికార్డ్ చేశారని తెలిపారు.
టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చినా.. ప్రీతి కాజ్ ఆఫ్ డెత్ క్లియర్గా తెలియడం లేదన్నారు. ఘటన జరిగిన రోజే ఎంజీఎంలో మొదట శాంపిల్స్ తీసుకుంటే టాక్సికాలజీ రిపోర్ట్లో సరైన ఫలితం వచ్చేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. చికిత్సలో భాగంగా ప్రీతికి నిమ్స్ ఆస్పత్రిలో బ్లడ్ డయాలాసిస్ చేశారన్నారు. బయటి నుంచి బ్లడ్ ఎక్కిస్తే టాక్సికాలాజీ పరీక్షల్లో ఏం తేలుతుందని ప్రశ్నించారు. గాంధీ హాస్పిటల్లో జరిగిన పోస్టు మార్టం నివేదిక అందితే అన్ని విషయాలు బయట పడతాయని చెప్పారు.