పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు

by Disha Web Desk 19 |
పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు దోషికి శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ఇప్పటికే రాకేశ్ రెడ్డిని దోషిగా తేల్చిన కోర్టు.. తాజాగా అతడికి జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. 2019 జనవరి 31న చిగురుపాటి జయరాం హత్య జరిగింది. కాగా, ఈ కేసుకు సంబంధించి ఇటీవల 23 పేజీల ఛార్జిషీట్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఇందులో 12 మందిని నిందితులుగా చేర్చారు. దాదాపు నాలుగేళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో చివరకు నిందితుడికి శిక్ష ఖరారైంది.



Next Story

Most Viewed