- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పు
by Satheesh |
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు దోషికి శిక్షను ఖరారు చేసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు దోషికి శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ఇప్పటికే రాకేశ్ రెడ్డిని దోషిగా తేల్చిన కోర్టు.. తాజాగా అతడికి జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. 2019 జనవరి 31న చిగురుపాటి జయరాం హత్య జరిగింది. కాగా, ఈ కేసుకు సంబంధించి ఇటీవల 23 పేజీల ఛార్జిషీట్ను జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఇందులో 12 మందిని నిందితులుగా చేర్చారు. దాదాపు నాలుగేళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో చివరకు నిందితుడికి శిక్ష ఖరారైంది.
Next Story






