- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జయరాం హత్య కేసులో తీర్పు వాయిదా
by GSrikanth |
ఎన్నారై పారిశ్రామికవేత్త, ఎక్స్ ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసులో తీర్పును నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నారై పారిశ్రామికవేత్త, ఎక్స్ ప్రెస్ టీవీ అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసులో తీర్పును నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. తీర్పు ఇంకా సిద్ధం కాలేదని మార్చి 6న తీర్పు వెలువరిస్తామని వెల్లడించింది. నాలుగు సంవత్సరాల విచారణ అనంతరం సోమవారం ఈ కేసుపై తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ సందర్భంగా 12 మంది నిందితులు కోర్టుకు హాజరయ్యారు. 2019 జనవరి 31న చిగురుపాటి జయరాం హత్య జరిగింది. ఈ కేసులో 300 మందికిపైగా వ్యక్తులను విచారించిన పోలీసులు.. 388 పేజీలతో చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో 12 మందిని నిందితులుగా చేర్చారు. మొత్తం 80 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి పోలీసులు సహకరించడం సంచలనం రేపింది. దీంతో ఈ కేసులో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Next Story






