- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఒంటిపై పెట్రోల్ పోసుకొని యువకుడి ఆత్మహత్య

దిశ, మిర్యాలగూడ : మద్యం మత్తులో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డా యువకుడు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డకు చెందిన గంటోజు మధు (38) మద్యంకు బానిసగా మారాడు. కాగా గత కొంతకాలంగా మద్యం కు డబ్బులు ఇవ్వాలంటూ తల్లిని హింసిస్తున్నాడు. అందులో భాగంగా రెండు రోజుల క్రితం తల్లి పేరు మీద ఉన్న ఇంటిని తనకు రాసి ఇవ్వాలంటూ బలవంతం చేయడంతో మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు మృతుడి తల్లి వచ్చింది. వెనకాల వచ్చిన మృతుడు అప్పటికే మద్యం తాగి ఉండడంతో పోలీసులు నచ్చజెప్పి పంపించారు. స్టేషన్ నుంచి బయటికి వెళ్ళగానే మద్యం మత్తులో ఉన్న మధు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోవడంతో శరీరం అంతా కాలిపోయింది. వెంటనే చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సిఐ సామ నర్సయ్య తెలిపారు.