యాదగిరిగుట్టలో బాలిక మృతదేహం కలకలం

by Kavya |
యాదగిరిగుట్టలో బాలిక మృతదేహం కలకలం
X

దిశ, యాదాద్రి భువనగిరి ‌ప్రతినిధి :యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు కళ్యాణకట్ట దగ్గర ఉన్న డార్మెంటరీ హాల్ లో బాలిక మృతదేహం లభ్యమైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.యాదగిరిగుట్ట ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం కళ్యాణ కట్ట దగ్గర ఉన్న డార్మెంటరీ హాల్లో ఒక బాలిక శవం పడి ఉండడాన్ని భక్తులు, దేవస్థానం సిబ్బంది గమనించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. మృతి చెందిన బాలికకు 10 నుంచి 12 సంవత్సరాలు ఉండవచ్చునని భావించారు‌. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. బాలిక మృతిపై విచారణ చేపడుతున్నట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ వెల్లడించారు.




Next Story

Most Viewed