- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు.. ఎక్కడంటే..?

దిశ, చౌటుప్పల్ టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో తీవ్రతరమైన మంచినీటి సమస్యపై బీజేపీ నాయకులు ఉద్యమం మొదలు పెట్టారు. బీజేపీ మండల శాఖ అధ్యక్షురాలు కడారి కల్పన నాయకత్వంలో స్థానిక మహిళలంతా కలిసి ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. పట్టణంలో నెలకొన్న మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. జాతీయ రహదారిపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రదర్శనలో పాల్గొన్నారు.
అనంతరం స్థానిక మహిళలు, బీజేపీ నాయకులు ర్యాలీగా వెళ్లి.. స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నరసింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో మంచినీటి సమస్య ఏర్పడి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారని గతంలోనే మున్సిపల్ కార్యాలయంలో విన్నవించడం జరిగగిందన్నారు. అయినప్పటికీ అధికారులు ఇంతవరకు ఈ సమస్యను పరిష్కరించకపోవడంతో.. మహిళలు రోడ్డెక్కారని తెలిపారు. మండు వేసవి దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చేయాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ ద్వారా వచ్చే మంచినీళ్లు 20 వార్డులకు సరఫరా చేయాలని కోరారు. మంచినీటి సమస్యను పరిష్కారం చేయకపోతే 500 మంది మహిళలతో కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవుల కోసమే తపిస్తున్నారు తప్ప..ఏ పని చేయడం లేదని ఆరోపించారు. నాకు హోంశాఖ పదవి వస్తే తప్ప నేను మునుగోడు ప్రజలను కలుసుకోలేను అన్న ధోరణిలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప ప్రజా సమస్యల మీద రాజగోపాల్ రెడ్డి ఎప్పుడూ దృష్టి సారించలేదన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్, రమనగోని శంకరయ్య, కైరంకొండ అశోక్, గుజ్జుల సురేందర్ రెడ్డి, పోలోజు శ్రీధర్ బాబు, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, ముత్యాల భూపాల్ రెడ్డి, ఆలే చిరంజీవి, రమనగోని దీపిక, పాలకూర్ల జంగయ్య గౌడ్, శాగ చంద్రశేఖర్ రెడ్డి, ఊడుగు యాదయ్య గౌడ్, కాసుల వెంకటేశం, రాధారపు సత్తయ్య, కడవేరు పాండు, చిలువేరు దుర్గయ్య, కట్ట కృష్ణ, గోషిక పురుషోత్తం, తడక సురేఖ, గోశిక నీరజ, ఊడుగు విజయలక్ష్మి, ముత్యాల పుష్ప, వనం ధనంజయ, కడారి ఐలయ్య, ఎడ్ల మహేశ్వర్ రెడ్డి, అమృతం దశరథ, బడుగు కృష్ణ, ఉబ్బు ఆంజనేయులు, బుడ్డ సురేష్, పాలెం అశోక్, కంచర్ల సరిత, వనం జయశ్రీ, గుజ్జుల సునీత, ఎడ్ల నిర్మల, ఊదరి శారద, భత్తిని విజయలక్ష్మి , బొడ్డు రేణుక, దిండు భాస్కర్, పబ్బు వంశీ, ఉష్కాగుల నాగరాజు, ఊదరి రంగయ్య, శ్రీధర్, ఒరగంటి భాను, వంగాల రామాకాంత్, ఇటుకల దామోదర్ రెడ్డి, బాతరాజు ప్రవీణ్, చేకూరి సాయి, చెరుకు శివ, గోశిక భావనారుషి, బొడ్డు మల్లేశం బొల్లమోని శ్రీశైలం గట్టు మొగలయ్య, కానుగు శేఖర్, కానుగు కొండల్, వివిధ వార్డుల్లోని మహిళలు పాల్గొన్నారు.