మహిళా సాధికారత అవసరం

by Naveena |

సమాజంలోని మహిళలకు సాధికారత అవసరమని మండల విద్యాశాఖాధికారి ఎం.గురవయ్య అన్నారు.

మహిళా సాధికారత అవసరం
X

దిశ, చిలుకూరు: సమాజంలోని మహిళలకు సాధికారత అవసరమని మండల విద్యాశాఖాధికారి ఎం.గురవయ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. శుక్రవారం బేతవోలు జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయినులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధికారత ద్వారా వారు తమ లక్ష్యాలను సాధించడంతో పాటు ఇతరులకూ సాయం చేయగల స్థాయికి చేరుకుంటారని ఆయన అన్నారు. ఆ దిశగా అందరూ ఆలోచించి మహిళాభ్యుదయానికి కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. సన్మానం పొందిన వారిలో ఉపాధ్యాయినులు కల్పన, సీఆర్పీ నిర్మల, ఓఎస్ రాజ్యం ఉన్నారు. వారిని పూలమాలలు, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి ప్రధానోపాధ్యాయుడు చందా శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, సిబ్బంది కోటేశ్వరరావు, వీరబాబు, శౌరి, వెంకన్న, శ్రీరామ్, కృష్ణ, ప్రకాశ్, వెంకటేశ్వర్లు, లాల్, శ్రీధర్ పాల్గొన్నారు.

Next Story