వందే భారత్ కి ఘనస్వాగతం..

by Disha Web Desk 20 |
వందే భారత్ కి ఘనస్వాగతం..
X

దిశ, మిర్యాలగూడ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన వందే భారత్ రైలు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మిర్యాలగూడకి చేరుకుంది. ఆధునాతన మోడల్లో 160కిలో మీటర్ల వేగంతో తిరుపతి వరకు ప్రయాణిస్తున్న రైలును వీక్షించేందుకు పెద్దసంఖ్యలో యువత, విద్యార్థులు, బీజేపీ నాయకులు స్టేషన్ కి వచ్చారు.

కైరళి పాఠశాల విద్యార్థులు సంసృతిక ప్రదర్శనలు చేసి జాతీయ జెండాలు చేతబట్టి రైలుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా అవతరిస్తుందని అన్నారు. తొక్కిసలాట జరక్కుండా డీఎస్పీ వెంకటగిరి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

Next Story