ద్విచ‌క్ర వాహ‌నాలు ఢీ.. ఇద్ద‌రికీ తీవ్ర గాయాలు

by Nallavelli.Anjaneyulu |

చింత‌ల‌పాలెం-మేళ్ల‌చెరువు ప్ర‌ధాన ర‌హ‌దారిపై ద్విచ‌క్ర వాహ‌నాలు ఢీ కొన్నాయి. దీంతో ఇద్ద‌రికీ తీవ్ర గాయాల‌య్యాయి.

ద్విచ‌క్ర వాహ‌నాలు ఢీ.. ఇద్ద‌రికీ తీవ్ర గాయాలు
X

దిశ‌, మేళ్లచెరువు : చింత‌ల‌పాలెం-మేళ్ల‌చెరువు ప్ర‌ధాన ర‌హ‌దారిపై ద్విచ‌క్ర వాహ‌నాలు ఢీ కొన్నాయి. దీంతో ఇద్ద‌రికీ తీవ్ర గాయాల‌య్యాయి. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మేళ్ల చెరువు-చింత‌ల‌పాలెం ప్ర‌ధాన ర‌హ‌దారి పై రెండు బైకులు ఢీ కొన‌డంతో వెల్ల‌టూరు గ్రామానికి చెందిన దాసు, సైదులు, పీక్ల నాయ‌క్ తండాకు చెందిన బానోత్ హ‌రీష్ గా గుర్తించారు. ఈ ప్ర‌మాదాన్ని గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే స్పందించి ఇద్ద‌రినీ సమీప ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story