రేవంత్ యాత్రలో తుంగతుర్తి నేతలు

by Dishanational2 |
రేవంత్ యాత్రలో తుంగతుర్తి నేతలు
X

దిశ,తుంగతుర్తి: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపడుతున్న హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా శుక్రవారం సూర్యాపేట,తుంగతుర్తి ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.ఇల్లందు,కామేపల్లి,కొత్త,పాత లింగాల ప్రాంతాలలో సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పాదయాత్ర కన్వీనర్ గుడిపాటి నరసయ్యలు రేవంత్ రెడ్డి వెంట పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకన్న,నర్సయ్యలు ఫోన్ ద్వారా "దిశ"తో మాట్లాడారు.యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని,కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకొని కేంద్ర,రాష్ట్రాలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని తెలిపారు.శనివారం కూడా యాత్రలో పాల్గొంటామని తెలిపారు. ఇదిలా ఉంటే దురాజ్ పల్లి లింగమంతుల జాతర సందర్భంగా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో వాయిదా పడ్డ జోడో యాత్రను రెండు మూడు రోజుల్లో తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.ఈ మేరకు అన్ని మండలాల పార్టీల బాధ్యులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.అర్వపల్లి మండల కేంద్రం నుండి ప్రారంభమయ్యే ఈ యాత్రకు మాజీమంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి హాజరుకానున్నారని పేర్కొన్నారు.

Next Story

Most Viewed