నేటి యువత Ambedkar ను స్ఫూర్తిగా తీసుకోవాలి : ఎస్ఐ దేవిరెడ్డి సతీష్ రెడ్డి

by Disha Web Desk 12 |
నేటి యువత Ambedkar  ను స్ఫూర్తిగా తీసుకోవాలి : ఎస్ఐ దేవిరెడ్డి సతీష్ రెడ్డి
X

దిశ, మునుగోడు: నేటి యువత అంబేద్కర్‌ను స్ఫూర్తి దాయకంగా తీసుకొని ముందుకు సాగాలని ఎస్ఐ దేవిరెడ్డి సతీష్ రెడ్డి సూచించారు.మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66 వర్ధంతి పురస్కరించుకొని మునుగోడు మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై సంఘం సభ్యులతో కలిసి చౌరస్తాలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు. అంటరానితనం వివక్షతలపై అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు.

మన దేశానికి మార్గదర్శకుడు అయిన అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలన్నారు. అంబేద్కర్ ఆలోచనలు అత్యంత ఆదర్శనియమన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న, యువజన అధ్యక్షుడు పెరుమల్ల ప్రమోద్, పెరుమాళ్ల కృష్ణయ్య, ముచ్చ పోతుల శ్రీను, దాసరి సాయికుమార్, ముచ్చ పోతుల శ్రీకాంత్, ఇండ్ల నాగరాజు, రెడ్డి మల్ల యాదగిరి, సిర్గమళ్ళ రమేష్, పెరుమాళ్ల ప్రణయ్ కుమార్,అద్దంకి వెంకటయ్య , బెల్లపు బాల శివ రాజు, పెరుమాళ్ల ప్రతాప్, బోల్లు సైదులు, పెరుమాళ్ల శ్రీరామ్, నిరుడు సైదులు, ముచ్చ పోతుల సాయి నిఖిల్, గాలి జీవన్, పెరుమాళ్ల రాజీవ్, గోలి ప్రవీణ్, చింతపల్లి వంశీ, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed