కెమికల్ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు..

by Disha Web Desk 11 |
కెమికల్ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు..
X

దిశ, భూదాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగుడెం గ్రామ పరిధిలోని ఎస్ వీఆర్ కెమికల్ కంపెనీలో సాల్వెంట్ ను రీసైక్లేషన్ చేస్తుండగా రియాక్షన్ పేలింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఏ బ్లాక్ లో ఎంతమంది కార్మికులు వర్క్ చేస్తున్నారనేది తెలియాల్సి ఉంది. అలముకున్న దట్టమైన పొగలో ఎంత మంది చిక్కుకున్నారనే సమాచారం ఇంకా తెలియరాలేదు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Next Story

Most Viewed