జిట్టా చేరికకు రంగం సిద్దం..!

by Disha Web Desk 22 |
జిట్టా చేరికకు రంగం సిద్దం..!
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మంగళవారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యేన్నం శ్రీనివాస్ రెడ్డితో మర్యాద పూర్వకంగా కలిశారు. జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. దీనిలో భాగంగానే ఆయన రేవంత్ రెడ్డిని కలిశారని, ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ లో జరిగే సభలో సోనియా గాంధీ సమక్షంలో జిట్టా కాంగ్రెస్ లో చేరనున్నారని ఊహగానాలు వినిపిస్తున్నాయి.


Next Story
null