- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నియమకం

దిశ,సూర్యాపేట : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పబ్లిక్ కార్యదర్శి కొప్పుల వేణరెడ్డి, వైస్ చైర్మన్ గా గట్టు శ్రీనివాస్ లను నియమిస్తూ శుక్రవారం వ్యవసాయ శాఖ సెక్రెటరీ రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ సభ్యులుగా ధరావత్ వీరన్న నాయక్, దాసరి తిరుమలరావు, నకిరేగంటి బాలకృష్ణ, పచ్చిపాల వెంకన్న, గోపగాని పెద్ద వెంకన్న, మేడిమలుపు దామోదర్ రెడ్డి, ఆర్తి కేశవులు, గోగుల పద్మ, చిన్నోజు నరసింహ చారి, షేక్ అబ్దుల్ కరీం, ఉప్పల్ సత్యనారాయణ, మాడుగుల నవీన్ కుమార్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొప్పుల వేణారెడ్డి నియామకం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించి ,కార్యకర్తలకు మున్సిపల్ మాజీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్ మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.