- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి : రీజనల్ డైరెక్టర్ గూడూరు అంజిరెడ్డి
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి : రీజనల్ డైరెక్టర్ గూడూరు అంజిరెడ్డి
విద్యార్థి దశ నుంచి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలని ఇంపాక్ట్ ఫౌండేషన్ రీజనల్ డైరెక్టర్ గూడూరు అంజిరెడ్డి అన్నారు.

X
దిశ, చిట్యాల : విద్యార్థి దశ నుంచి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలని ఇంపాక్ట్ ఫౌండేషన్ రీజనల్ డైరెక్టర్ గూడూరు అంజిరెడ్డి అన్నారు. బుధవారం చిట్యాల పట్టణ కేంద్రంలోని లయోలా టెక్నో హై స్కూల్ లో నిర్వహించిన మోటివేషనల్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను పెట్టుకున్నప్పుడే వాటిని సాధించేందుకు క్రమశిక్షణతో పట్టుదలతో కృషి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను గురువులను గౌరవించడంతోపాటు దేశభక్తిని కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మోటివేషనల్ స్పీకర్ నందికొండ రవీందర్ రెడ్డి పాఠశాల చైర్మన్ ఎన్.ఎఫ్ సుందర్ రాజ్, రీజనల్ ప్రెసిడెంట్ కోట్ల సాయికిరణ్, పాఠశాల డైరెక్టర్ తీగల కిరణ్, మూర్తల వెంకన్న, బెల్లం శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.
Next Story






