చేవెళ్ల ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి..

by Kodari Anjali |

స్కూల్‌ బస్సు కోసం వేచి చూస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపాల్ పరిధిలో జరిగింది.

చేవెళ్ల ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి..
X

దిశ, చేవెళ్ల: స్కూల్‌ బస్సు కోసం వేచి చూస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపాల్ పరిధిలో చోటు చేసుకుంది. చేవెళ్లలో ఉన్న షాబాద్ చౌరస్తా వద్ద స్కూల్‌ బస్సు కోసం సాత్విక్‌ రెడ్డి అనే స్టూడెంట్ వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆ విద్యార్థి మృతి చెందాడు. మృతదేహంను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తోటి స్టూడెంట్స్, కుటుంబీకులు, గ్రామస్తులు, బంధువులు ఆసుపత్రికి భారీగా చేరుకుంటున్నారు. విద్యార్థి చేవెళ్ల మున్సిపాల్ పరిధిలో ఉన్న కందవాడ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

Next Story