- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రేషన్కు బియ్యం కొరత.. నిలిచిన రేషన్ బియ్యం సరఫరా

దిశ, నల్లగొండ బ్యూరో/మిర్యాలగూడ టౌన్ : ప్రజా పంపిణీ సరఫరా చేసే బియ్యం గోదాములు మూతపడ్డాయి. నెల వారీగా ప్రజలకు సరఫరా అవుతున్న బియ్యం మార్చి నెలలో నిండుకున్నాయి. ప్రభుత్వ ఆలసత్వం వల్ల ప్రజలకు అందాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం ఈ నెలలో అందే అవకాశంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రతి నెల మొదటి వారంలో సరఫరా కావాల్సిన బియ్యం నేటికి అందని పరిస్థితి నెలకొన్నది. దీంతో వేల కుటుంబాలకు అందాల్సిన బియ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని కేంద్రాలలో ఇదే పరిస్థితి నెలకొన్నది.
ఉమ్మడి జిల్లాలో అందని రేషన్ బియ్యం...
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 8 గోదాముల ద్వారా రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయనున్నారు. అయితే మార్చి నెలలో రావాల్సిన కోటా బియ్యం నేటికి గ్రామాలకు సరఫరా కాలేదు. జిల్లాలో ఉన్న గోదాములకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బియ్యం సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో జిల్లాలోని రేషన్ షాపులకు చేరాల్సిన ప్రజా పంపిణీ బియ్యం చేరలేదు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని గోదాం నుంచి 241 రేషన్ షాపులకు 14వేల క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా.. కేవలం 54 షాపులకు సరఫరా చేశారు. ఇదే పరిస్థితి జిల్లాలో కొనసాగుతుందని అధికారుల ద్వారా తెలిసింది. జిల్లాలోని రేషన్ కార్డు దారులకు కొన్ని లక్షల టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ ముందు చూపు లోపం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లా బియ్యం ఇతర జిల్లాలకు సరఫరా..?
జిల్లాకు సరఫరా అయ్యే బియ్యం ఇతర జిల్లాలకు సరఫరా చేసినట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 150కు పైగా రైస్ మిల్లులు ఉన్నప్పటికీ బియ్యం కొరత రావడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా బియ్యం కొరత ఏర్పడడం శోచనీయం. అధికారుల ముందుచూపు లేకపోవడంతో సకాలంలో బియ్యం సరఫరా చేయడంలో జాప్యం జరుగుతోంది. జిల్లాలో సరిపడా బియ్యం లేకపోయినా ఇతర జిల్లాలకు ఏలా సరఫరా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
చేతులేత్తిసిన సివిల్ సప్లై అధికారులు..
ప్రభుత్వం నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం సరఫరా నిలిచిపోవడంతో సివిల్ సప్లై అధికారులు కూడా చేతులేత్తాశారు. మార్చి మొదటి వారం వరకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బియ్యం రాకపోవడంతో డీలర్లు గోదాములు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అరకొర బియ్యం వచ్చినా ఎవరికకీ సరఫరా చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. బియ్యం కోసం గోదాంల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేక డీలర్లు వెనుదిరిగి పోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బియ్యం సరఫరా చేయాలని కోరుతున్నారు.