Road Accident : యాదగిరిగుట్ట వెళ్ళి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. 35 మందికి తీవ్ర గాయాలు

by Muthe.Rajitha |   (  Updated:2025-01-19 13:15:46  IST  )

వరంగల్ హైవే(Warangal Highway)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Road Accident : యాదగిరిగుట్ట వెళ్ళి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. 35 మందికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : వరంగల్ హైవే(Warangal Highway)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో యాదగిరిగుట్ట(Yadagirigutta) వెళ్ళి వస్తున్న డీసీఎం వ్యాను బోల్తా పడిన ఘటనలో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్(Mahabubnager) లోని ఉప్పునూతల గ్రామానికి చెందిన 35 మంది యాదగిరిగుట్టకు వెళ్లి వస్తుండగా, వరంగల్ హైవేపై ఘట్కేసర్ దగ్గర్లో డీసీఎం బ్రేకులు ఫెయిల్ అయి.. ఒక్కసారిగా వాహనం పల్టీ కొట్టి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, స్థానికులతో కలిసి క్షతగాత్రులను ఘట్కేసర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Next Story