వాహనాల వేలం ద్వారా రూ.2.05 లక్షల ఆదాయం

by Kodari Anjali |

వివిధ కేసులలో పట్టుబడిన వాహనాల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.2.05 లక్షల ఆదాయం చేకూరింది.

వాహనాల వేలం ద్వారా రూ.2.05 లక్షల ఆదాయం
X

దిశ,తుంగతుర్తి: వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలకు నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలోని ఎక్సైజ్ ప్రొహిబిషన్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం జరిగిన వేలం పాటలో ప్రభుత్వానికి రూ.2 లక్షల 5 వేల 910 ఆదాయం చేకూరింది. మొత్తంగా వేలంపాటలో 9 వాహనాలను పలువురు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ సూపరిండెంట్ లక్ష్మణ్ నాయక్, ఎక్సైజ్ ఎస్సై ఏ.రజిత, సబ్ ఇన్స్ పెక్టర్లు డి.మూర్తి, ఎం.జయ ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

Next Story