ప్రణయ్ హత్య కేసులో నేడే తుది తీర్పు.. కోర్టుకు చేరుకున్న నలుగురు నిందితులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-10 05:40:16  IST  )

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ జిల్లా కోర్టు మధ్యాహ్నం తుది తీర్పును వెలువరించనుంది.

ప్రణయ్ హత్య కేసులో నేడే తుది తీర్పు.. కోర్టుకు చేరుకున్న నలుగురు నిందితులు
X

దిశ, నల్లగొండ క్రైం: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో జిల్లా కోర్టు మధ్యాహ్నం తుది తీర్పును వెలువరించనుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే నలుగురు నిందితులు కోర్టుకు చేరుకున్నారు. గుజరాత్‌కు చెందిన సుపారీ గ్యాంగ్‌లో మరో ప్రధాన నిందితులు కోర్టుకు చేరుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కోర్టుల ఎదుట ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటచేసుకోకుండా పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టు ప్రాంగణానికి వచ్చినా ప్రతి ఒక్కరిని.. క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అయితే, కేసులో న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇస్తారోనని రాష్ట్ర వ్యాప్తంగా జనం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Next Story